వైసిపి తరఫున నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిన రఘురాం కృష్ణంరాజు ఆ పార్టీలో కొంతకాలమే సఖ్యత గా ఉన్నారు.జగన్ తో విభేదాలు కారణంగా ఆయన రెబల్ గా మారి తరచుగా వైసిపి ప్రభుత్వం పైన జగన్ తీసుకుంటున్న నిర్ణయాల పైన స్పందిస్తూ కోర్టుల్లో జగన్ నిర్ణయాలను ప్రశ్నిస్తూ పిటిషన్లు వేస్తూనే ఉన్నారు.
ఆయనకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు.అయినా వరుసగా ఒకరిపై ఒకరు సోషల్ మీడియా ద్వారా విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు.
ఈ వ్యవహారం ఇలా ఉండగానే, పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు.
దీనికి స్థానిక ఎంపీ హోదాలో రఘురామ వచ్చేందుకు ప్రయత్నించగా… ఆయనకు అనేక అడ్డంకులు ఎదురయ్యి మధ్యలోనే తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.ఈ వ్యవహారంపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో వ్యంగంగా కామెంట్స్ చేశారు.” PMO జాబితాలో పేరు లేదంటేనే అర్థమైంది నువ్వు ఎటు కాని బఫూన్ గాడివని.టికెట్ ఇచ్చిన పార్టీకి ద్రోహం చేసి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన నికృష్టుడివి.
నీ జాతకం బిజెపి పెద్దలకు తెలియదా.కడుపుకి ఏం తింటున్నావో ఏమో.ఇంత లుచ్చా గాడివి అయ్యావేంట్రా విగ్గూ ? ఎందుకురా నీ బ్రతుకు.” అంటూ పోస్ట్ పెట్టారు.ఇక మరో పోస్ట్ లో .” ఎందుకు బయలుదేరి ఎందుకు రైలు దిగి పారిపోయాడు ఈ అవారా గాడు, తాగి పడుకోక, భోగి తగలబెట్టే కుట్ర సిద్ధాంతం ఏంట్రా విగ్గూ? ఎప్పుడో ఆ బోల్లిగాడే నిన్ను లేపేసి ఇతరుల మీదకు నెడతాడు.ఇంట్లో కప్పు కూలి మీద పడొచ్చు.
గ్రహశకలం వచ్చి తలపైనా పడొచ్చు.చస్తూ బతికే శాపం ఏదో ఉందిరా పెగ్గుగా ! ” అంటూ సెటైర్లు వేశారు.