మనం చాలా దేవుళ్లకు పూజ చేస్తుంటాం.ఒక్కో రూపంలో కొలస్తుంటాం.
అలాగే మనం కోరుకున్న కోరికలు తీరాలని చాలా రకాల మొక్కులు మొక్కుతుంటాం.కొందరు కొబ్బరి కాయలు కొడ్తామని, యాటలు కోస్తామని, బంగారం, వెండి వస్తువులు సమర్పిస్తామని, అలాగే బట్టలు, డబ్బులు… తల నీలాలు, అన్నదానం ఇలా మనకు తోచిన తీరుగా మొక్కుతుంటాం.
కోరిన కోర్కెలు నెరవేరితే ఈ మొక్కులను చెల్లించుకొని హాయిగా జీవిస్తుంటాం.కానీ ఓ మధ్ ప్రదేశ్ లోని సీధీ జిల్లాకు చెందిన ఓ అమ్మాయి మాత్రం… అమ్మ వారికి ఓ విచిత్ర మైన మొక్కును మొక్కింది.
దానిని తీర్చుకునేటప్పుడు చూసిన వారంతా ఒక్కసారిగా షాకయ్యారు.అసలేమైందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సీధీ జిల్లాలోని బడా గ్రామానికి చెందిన 20 ఏళ్ల రాజ్ కుమారీ పటేల్ గురువారం రోజు తన తల్లిదండ్రులతో కలిసి గ్రామంలోని అమ్మవారి ఆలయానికి వెళ్లింది.వారంతా పూజ చేస్తుండగా… ఈ అమ్మాయి బ్లేడుతో తన నాలుకను కోసేస్కొని అమ్మావారి పాదాలపై పడేసింది.
ఓ విచిత్ర ఘటన చూసిన తల్లిదండ్రులు, స్థానికులు ఒక్కసారిగా షాకయ్యారు.ఆమె అలా ఎందుకు చేసిందో తెలియక ఆందోళన చెందారు.వెంటనే వైద్యులకు సమాచారం అందించడంతో… రంగంలోకి దిగిన వైద్యులు అమ్మాయికి ప్రాథమిక చికిత్స చేశారు.ఎలాంటి భయం లేదని చెప్పగా కాస్త ఊపిరి పీల్చున్నారు.
అయితే అమ్మాయి కావాలనే అమ్మవారికి తన నాలుకను సమర్పించిందట.భక్తులకు దేవుడిపై నమ్మకం, భక్తి ఉండాలి కానీ ఇలాంటి మూఢ నమ్మకం మంచిది కానది పోలీసుల తెలిపారు.