దేశంలో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు విధించడానికి రెడీ అవుతున్నాయి.ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడటం మనం వింటూనే ఉన్నాం.
నందమూరి బాలకృష్ణ… వైసీపీకి చెందిన నాయకులు కరోనా బారిన పడగా తాజాగా ఇప్పుడు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కరోనా బారిన పడటం జరిగింది.
దీంతో హైదరాబాద్ లో హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నరు.ఇటువంటి తరుణంలో తనని ఇటీవల కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.గతవారం వంశీ పంజాబ్ రాష్ట్రంలో మొహాలికి ఎడమ చేయి విపరీతంగా నొప్పి రావడంతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు.
ఈసీజీ, 2డీ ఏకో వంటి టెస్టులు చేయగా తర్వాత రెండు రోజులకు అక్కడ నుండి డిశ్చార్జ్ చేయాలి.ఈ క్రమంలో తాజాగా వంశీ కరోనా బారిన పడటం సంచలనంగా మారింది.