ఉపాసన కొణిదెల. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు.
మెగా కోడలుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్యగా ఈమె అందరికి సుపరిచితమే.ఉపాసన ప్రస్తుతం అపోలో హాస్పిటల్ ఛైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తూనే సమాజంలో చైతన్యం కలిగించే విషయాలు కూడా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఎప్పటికప్పుడు తెల్పుతూ ప్రజలకు దగ్గరగా ఉంటుంది.
అయితే ఎప్పుడు పాజిటివ్ గా స్పందించే నెటిజెన్స్ ఈసారి మాత్రం ఉపాసన పై ఫైర్ అవుతున్నారు.ఎప్పుడు మంచి మంచి పోస్ట్ లు చేస్తూ తెలుగు ప్రజల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించు కున్న ఉపాసన ఈసారి మాత్రం నెటిజెన్స్ ఆమెకు నెగిటివ్ గా స్పందిస్తున్నారు.
ఉపాసన తాజాగా షేర్ చేసిన పోస్ట్ వివాదంగా మారింది.ఈమె షేర్ చేసిన ఈ ఫోటో మహిళల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిన్న గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ ఉపాసన ఒక పోస్ట్ షేర్ చేసింది.
ఇంతకీ ఆ పోస్ట్ ఏంటంటే.ఒక పెద్ద గుడి గోపురం పై విగ్రహాల మధ్యలో కొందరు సామాన్య ప్రజలు నిలుచున్నట్టుగా ఫోటో ఎడిట్ చేసారు.గుడి గోపురం పై సూక్ష్మ రూపంలో కొందరు ప్రజలు నిలుచుని ఉన్న ఆ ఫొటోలో ”తాను తన భర్త చరణ్ కూడా ఉన్నామని ఎక్కడ ఉన్నామో కనుక్కోండి అంటూ ఉపాసన పోస్ట్ చేసింది.
ఆ తర్వాత ఈ ఫోటో తనకు బాగా నచ్చిందని కూడా చెప్పడంతో ఉపాసన పై నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ పోస్ట్ కొన్ని క్షణాల్లోనే వైరల్ అయ్యింది.మీరు ఎంత గొప్ప వారు అయినా అవ్వచ్చు.కాని దేవుడి గోపురాన్ని అడ్డు పెట్టుకుని ప్రచారం చేసుకోవడం మంచిది కాదని.ఈ పోస్ట్ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ ఈమెపై ఫైర్ అవుతున్నారు.