స్టార్ హీరోతో సినిమా అంటే పక్కన అందమైన స్టార్ హీరోయిన్ ఉండాల్సిందే.అలా ఉంటేనే అటు సినిమా కి ప్రత్యేకమైన అందం కూడా వస్తూ ఉంటుంది.
ప్రేక్షకులు థియేటర్లకు వస్తుంటారు.అదే ఒక సారి కలిసి నటించి హిట్ కొట్టిన జోడి అయితే ఇక సినిమాకు మరింత ప్లస్ పాయింట్.
సినిమా కోసం కాకపోయినా ఆ జోడి చూసేందుకైనా వస్తూ ఉంటారు ప్రేక్షకులు.అందుకేనేమో ఇప్పుడు టాలీవుడ్లో చాలా మంది హీరోలు అంతకు ముందు నటించిన హీరోయిన్లనే రిపీట్ చేస్తున్నారు.
ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
గోపీచంద్ సరసన రాశికన్నా ఇప్పటికే రెండు సినిమాలు చేసింది.
జిల్, ఆక్సిజన్ సినిమా లో నటించగా.ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన కమర్షియల్ లో గోపీచంద్ తో జతకట్టి హిట్ కొట్టేందుకు రెడీ అయింది.
మహర్షి తో మహేష్ బాబు సరసన నటించే మరో హిట్ ను అందుకుంది మత్తెక్కించే బ్యూటీ పూజా హెగ్డే.ఇక ఇప్పుడు మరోసారి మహేష్ సరసన త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.
వినయ విధేయ రామ సినిమా రామ్ చరణ్ కెరీర్లో డిజాస్టర్గా నిలిచింది.కానీ ఈ సినిమాలో కియారా అద్వానీ తో రామ్ చరణ్ రొమాన్స్ మాత్రం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.అందుకే ఈ జోడి శంకర్ సినిమాలో రిపీట్ కాబోతుంది అని తెలుస్తోంది.
మహానటి సినిమాలో కీలకపాత్రల్లో ప్రేమికులుగా నటించారు సమంత విజయ్ దేవరకొండ. ఇప్పుడు ఇదే జోడి ని రిపీట్ చేస్తూ ఖుషి సినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.వీరి కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి.
నేను లోకల్ తో జోడీ గా గుర్తింపు సంపాదించుకున్నారు నాని, కీర్తి సురేష్. ఇక ఇప్పుడు ఇన్నేళ్ళ తర్వాత దసరా సినిమాతో మరోసారి జత కట్టనుంది ఈ జోడి.
నాగచైతన్యతో బంగార్రాజు సినిమాలో కృతి శెట్టి నటించగా.ఇక ఇప్పుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ఈ అమ్మడు రిపీట్ కాబోతుంది.వెంకి మామ లో చేసిన రాశి ఖన్నా ఇప్పుడు నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న థాంక్యూ సినిమాలో మరోసారి చైతన్యతో కలిసి నటిస్తుంది.
వరస సినిమా లతో దూసుకు పోతున్న మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహ రెడ్డి సినిమాలో తన ప్రియురాలి గా నటించిన మిల్కీ బ్యూటీ తమన్నాను ఇప్పుడు బోలా శంకర్ సినిమా లో పెట్టుకున్నాడు.ఇలా అందరూ హీరోలు రిపీట్ మోడల్ లోనే ఉన్నారు అనేది తెలుస్తుంది.