రాజకీయాల్లో గండర గండుడుగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు నాయుడుకు కొంత బ్యాడ్ టైమ్ నడుస్తోందనే చెప్పాలేమో.ఎందుకంటే ఆయన గతంలో ఎన్నడూ చూడనన్ని అవమానాలు, ఓటములు చవి చూస్తున్నారు.
మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఒక్కసారి సీఎం అయిన జగన్ ముందు తేలిపోయే పరిస్థితులు వస్తున్నాయి.అయితే ఇందులో మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడును జగన్ పార్టీలోని ఓ నలుగురు బాగా టార్గెట్ చేస్తున్నారు.
వారు చేసే వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడుకు ఎంతో బాధకలిగిస్తున్నాయనే చెప్పాలి.
అయితే ఇప్పుడు ఆ నలుగురిని చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.
ఆయన త్వరలోనే వారిమీద రివేంజ్ తీర్చుకోవడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం.మరీ ముఖ్యంగా అసెంబ్లీలో తనను ఆ నలుగురు బాగా అవమానించారంటూ చంద్రబాబు మనస్థాపం చెందుతున్నారంట.
కొడాలి నాని, వల్లభనేని వంశీ, చంద్రశేఖర్ రెడ్డి, రాంబాబు కలిసి చంద్రబాబును ఎంతటి మాటలు అంటున్నారో అందరం చూస్తూనే ఉన్నాం.అయితే ఈ నలుగురి నియోజకవర్గాల్లో వారిని ఓడించేందుకు చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తోంది.
కొడాలి నానికి చెక్ పెట్టేందుకు గుడివాడలో వంగవీటి రాధాను పోటి చేయించేందుకు చంద్రబాబు రెడీ అవుతున్నారంట.గతంలో రెండు సార్లు ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలిచింది.అదే విధంగా మిగతా మూడు నియోజకవర్గాలు అయిన గన్నవరం, కాకినాడ టౌన్, సత్తెనపల్లిలో 2014లో టీడీపీ జెండా ఎగిరింది.ఇక సత్తెన పల్లిలో కోడెలకే కోడెల శివరాంను పోటీ చేయిస్తారంట.
అలాగే రాయపాటి వర్గాన్ని సత్తెన పల్లిలో పోటీ చేయించాలని చంద్రబాబు చూస్తున్నారంట.ఇకపోతే కాకినాడలో వనమాడి వెంకటేశ్వరరావు బలంగా ఉన్నారు కాబట్టి ఆయన్నే దింపుతారని తెలుస్తోంది.
ఇలా వీరిని ఇప్పటి నుంచే అక్కడ బలం పెంచుకునే విధంగా చంద్రబాబు ప్లాన్ వేస్తున్నారంట.
.