మాజీ మంత్రి కొడాలి నానిపై బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు.అప్పుడే కొడాలి నానికి చెమటలు పడుతున్నాయన్నారు.
జగన్ జైల్లో ఉంటే తల్లి, చెల్లి రోడ్ల మీదకు వచ్చి పాదయాత్ర చేశారని.అలాంటి వారిని అధికారంలోకి రాగానే ఇంటి నుంచి గెంటేయలేదా? అని ప్రశ్నించారు.వెన్నుపోటుకు, గొడ్డలిపోటుకు పేటెంట్ జగన్ అని విమర్శించారు.ఇంకా బుద్దా వెంకన్న మాట్లాడుతూ.‘‘కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకో.సొంత బాబాయ్ ని గొడ్డలితో నరికించిన చరిత్ర ఎవరిది? అంటే వెన్నుపోటు దారుడు ఎవరో .కొంచెం మైండ్ పెట్టి ఆలోచించు.
దమ్ముంటే చర్చకు రా… వెన్నుపోటు, గొడ్డలి పోటు ఎవరిదో తేలుద్దాం.
కొడాలి నానిని నాడు టీడీపీ నుంచి బయటకు గెంటేశాం.ఎన్టీఆర్ను తిట్టిన వైయస్ నీకు దేవుడా? నిన్ను ఎమ్మెల్యేని చేసిన చంద్రబాబు వెన్నుపోటు దారుడా? తల్లి, చెల్లిని పార్టీ నుంచి గెంటేసిన జగన్ వెన్నుపోటుదారుడు కాదా? రేపు గుడివాడ మహానాడుతో కొడాలి నాని పని అయిపోతుంది.నానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది… గుడివాడ ప్రజలే తగిన బుద్ది చెబుతారు’’ అని పేర్కొన్నారు.