స్టార్ హీరోయిన్ సమంత వరుసగా సినిమాలతో బిజీ కావడంతో పాటు టీవీ షోలలో కూడా పాల్గొంటూ బిజీ అవుతున్నారు.కెరీర్ విషయంలో సమంత ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
విడాకుల ప్రకటన తర్వాత సమంత బాలీవుడ్ లో బిజీ అవుతారని అందరూ భావిస్తే హాలీవుడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సమంత అందరినీ ఆశ్చర్యపరిచారు.తాజాగా ఒక చిట్ చాట్ లో పాల్గొన్న సమంత ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.
2021 సంవత్సరం తనకెంతో క్లిష్టమైన సంవత్సరం అని సమంత పేర్కొన్నారు.నాగచైతన్యకు విడాకులు ఇవ్వడం వల్లే సమంత ఈ విధంగా కామెంట్లు చేసి ఉండవచ్చని నెటిజన్లు భావిస్తున్నారు.
సమంత చేసిన కామెంట్ విని నెటిజన్లు “బీ స్ట్రాంగ్ మేడమ్” అంటూ కామెంట్లు పెడుతుండగా ఆ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.ప్రేమించి పెద్దలను ఒప్పించి చై, సామ్ పెళ్లి చేసుకోగా ఎవరూ ఊహించని విధంగా వాళ్లు విడిపోయారు.
విడాకుల తర్వాత అటు చైతన్య, ఇటు సమంత సినిమాలపరంగా బిజీ అవుతున్నారు.విడాకుల తర్వాత సమంత మానసికంగా కృంగిపోయారని వార్తలు తెగ వైరల్ అయ్యాయి.ఆ బాధను మరిచిపోవడానికి సమంత స్నేహితులతో కలిసి టూర్లకు వెళ్లారు.ఆ తర్వాత సమంత కెరీర్ పై దృష్టి పెట్టి సినిమాలతో బిజీ అయ్యారు.హాలీవుడ్ లో కూడా ఆఫర్లను అందిపుచ్చుకుంటూ సినిమాసినిమాకు సమంత క్రేజ్ ను పెంచుకుంటున్నారు.
సోషల్ మీడియాలో సమంత హవా కొనసాగుతుండగా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ సైతం అంతకంతకూ పెరుగుతోంది.సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండే సమంతకు దాదాపుగా 20 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.సమంత నటించిన శాకుంతలం మూవీ రిలీజ్ డేట్ ప్రకటన వెలువడాల్సి ఉంది.
గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.