మహేష్ బాబు, సాయిపల్లవి కాంబినేషన్ లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా తెరకెక్కలేదనే సంగతి తెలిసిందే.అయితే ఈ కాంబినేషన్ లో సినిమా రావాలని కోరుకునే ఫ్యాన్స్ సంఖ్య మాత్రం ఎక్కువగానే ఉంది.
మిడిల్ రేంజ్ హీరోలకు జోడీగా ఎక్కువగా నటిస్తున్న సాయిపల్లవి త్వరలో విరాటపర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారనే సంగతి తెలిసిందే.అయితే తాజాగా సాయిపల్లవి మహేష్ బాబుపై అభిమానాన్ని చాటుకున్నారు.
సాయిపల్లవి చేసిన పని ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట గురువారం రోజున థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
మహేష్ బాబుకు వీరాభిమాని అయిన సాయిపల్లవి హైదరాబాద్ లోని మల్టీప్లెక్స్ లో సర్కారు వారి పాట సినిమాను ఆడియన్స్ మధ్య దొంగచాటుగా చూశారు.సాయిపల్లవికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ఈ విషయం తెలిసి మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో సాయిపల్లవి థియేటర్ లో సినిమా చూసిన విషయాన్ని తెగ వైరల్ చేస్తున్నారు.సాధారణంగా హీరోయిన్లు వాళ్లు హీరోయిన్ గా నటించిన సినిమాలు మినహా ఇతర సినిమాలను థియేటర్లలో చూడటానికి పెద్దగా ఇష్టపడరు.
ఈ విషయంలో సాయిపల్లవి మాత్రం భిన్నంగా వ్యవహరించడం గమనార్హం.మరోవైపు సాయిపల్లవి కొత్త ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.
ప్రతి పాత్రకు సాయిపల్లవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా కెరీర్ కు ప్లస్ అయ్యే పాత్రలకు మాత్రమే ఓటేస్తున్నారు.థియేటర్ లో సినిమా చూసిన తర్వాత సాయిపల్లవి ముఖానికి స్కార్ప్ కట్టుకుని చేతిలో బ్యాగ్ ను తగిలించుకుని ఎవరికీ అనుమానం రాకుండా కారు దగ్గరకు వెళ్లడం గమనార్హం.సాయిపల్లవి చేసిన పనికి మహేష్ బాబు అభిమానులు మాత్రం ఫిదా అయ్యారనే చెప్పాలి.