సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయింది.సిరివెన్నెల ఇక లేరు అనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.
సిరివెన్నెల మరణం తర్వాత పలువురు ప్రముఖులు అతనితో ఉన్న మధురమైన జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.తాజాగా టాలీవుడ్ కాంట్రవర్సి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా సిరివెన్నెల సీతారామశాస్త్రితో తనకున్న అనుభవాలను గుర్తు చేసుకుంటూ పాటలు పాడి వినిపించారు.
అనంతరం తనదైన శైలిలో స్పందిస్తూ వరుస ఆడియోలను ట్విట్టర్ ద్వారా వదిలారు.
ఈ నేపథ్యంలోనే సిరివెన్నెల మరణం పట్ల ఆర్జివి స్పందిస్తూ.సిరివెన్నెల రాసిన.‘సాహసం నా పథం రాజసం నా రథం సాగితే ఆపడం సాధ్యమా’ లాంటి పదాలు నన్ను చాలా ప్రభావితం చేశాయి.ఈ పాటలో ఉన్న పదాలే నా జీవితం.ఇలాంటి అద్భుతమైన పదాలు రాసి.ఎంతోమంది జీవితాలను ప్రభావితం చేసిన మీరు ఖచ్చితంగా స్వర్గానికి వెళ్లి ఉంటారు.అక్కడ రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమలకు నా హాయ్ చెప్పండి.
నేను పాపాలు చేసి నరకానికి వెళ్లాను.ఒకవేళ యముడి లెక్కల్లో ఏదైనా అకౌంట్ మిస్ అయ్యి.పొరపాటున నేను స్వర్గానికి వస్తే.మీరు నాతో కలిసి ఎప్పుడూ వోడ్కా తాగలేదు.అక్కడ మనిద్దరం కలిసి అమృతంతో ఓ పెగ్గు వేద్దాం అంటూ సిరివెన్నెల మరణంపై వ్యగ్యంగా ఆడియో విడుదల చేశారు వర్మ.దీనితో వర్మ పోస్ట్ పై నెటిజన్లు ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
మరణంలో కూడా నీవు ఒడ్కా పిచ్చి వదల్లేదుగా ఇక్కడ కూడా నీ వ్యగ్యం ఏంటని.ఈ క్రియేటివిటీకి ఒక దండం రా స్వామీ అంటూ దండాలు పెట్టేస్తున్నారు.
అలాగే అతడిపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు.