కరోనా మహమ్మారి వల్ల సినీ ఇండస్ట్రీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం అందరికి తెలిసిందే.సామాన్యుల తో పాటుగా సినీ ఇండస్ట్రీ వాళ్లు కూడా కరోనా మహమ్మారి వల్ల ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
అయితే ఇప్పటికే కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ కారణంగా సినిమాలు వాయిదా పడిన విషయం తెలిసిందే.అయితే కరోనా ఇప్పుడు కూడా తగ్గుముఖం పడుతుంది అనుకుంటున్న నేపథ్యంలో మరొకసారి కరోనా కోరలు చాస్తోంది.
ఇక తాజాగా కరోనా థర్డ్ వేవ్ కారణంగా ఇప్పటికే పలు సినిమాల విడుదల తేదీ వాయిదా పడిన విషయం తెలిసిందే.కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత భారీ బడ్జెట్ సినిమాలు థియేటర్ లలో సందడి చేయడానికి రెడీగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమాల కోసం చెర్రీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఈ నేపథ్యంలోనే అభిమానుల కోరిక మేరకు రామ్ చరణ్ కూడా తాను నటించిన సినిమాలను విడుదల చేయడానికి సిద్ధం అవుతున్నాడు.
ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ ను షేర్ చేయడానికి రామ్ చరణ్,ఎన్టీఆర్ తో కలిసి సిద్ధమైన విషయం అందరికి తెలిసిందే.అయితే ఈ సినిమా జనవరి 7న విడుదల కావాల్సి ఉండగా కరోనా మహమ్మారి వల్ల వాయిదా పడింది.
ఇక రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి తో కలసి ఆచార్య సినిమాలో నటించిన విషయం తెలిసిందే.ఆ సినిమాను కూడా కరోనా మహమ్మారి కారణంగా ఏప్రిల్ 1 వ తేదీకీ వాయిదా వేశారు.
ఈ రెండు సినిమాలే కాకుండా రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఆర్ సి 15 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తామని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు.రామ్ చరణ్ నటించిన సినిమాల విడుదల విషయానికి వస్తే ఆర్ఆర్ఆర్ సినిమా మార్చి 18 లేదా 28న రిలీజ్ కానుంది.అలాగే ఆచార్య సినిమా ఏప్రిల్ 1న సందడి చేయనుంది.అదేవిధంగా ఆర్సి 15 వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.
రామ్ చరణ్ నటించిన ఈ మూడు సినిమాల్లో రెండు సినిమాలు పాన్ ఇండియా సినిమాలు కావడం విశేషం.