బాలీవుడ్ నటి ముద్దుగుమ్మ, బిగ్ బాస్ బ్యూటీ రాఖీ సావంత్ గురించి మనందరికీ తెలిసిందే.రాఖీ సావంత్ కొన్ని నెలల కిందట రితేష్ సింగ్ తో విడిపోయిన విషయం అందరికి తెలిసిందే.
మొదట్లో తనను బాగానే చూసుకున్న రితేష్ రానురానూ తనను, తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడని వాపోయింది రాఖీ సావంత్.ఇకపోతే ప్రస్తుతం రాఖీ వ్యాపారవేత్త అదిల్ దురానీతో ప్రేమలో ఉన్న విషయం తెలిసింది.
కానీ ఒకానొక సమయంలో తన మాజీ భర్త చేసిన పనికి తనకు ఉరేసుకోవాలనిపించిందని చెప్పుకొచ్చింది రాఖీ సావంత్.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఇంటర్వ్యూలో అలాంటి కామెంట్స్ చేయడంతో బాలీవుడ్ సిని ఇండస్ట్రలో ఆ సంబదించిన వీడియో వైరల్గా మారింది.
అందులో రాఖీ మాట్లాడుతూ.తాను బిగ్బాస్ హౌస్లో ఉన్నప్పుడు తన తల్లి ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య ఉంటే రితేశ్ కనీసం ఆమెను పట్టించుకోలేదని, హాస్పిటల్ బిల్లులు కూడా కట్టలేదని చెప్పుకొచ్చింది.
అతడి ప్రవర్తనతో ఆ సమయంలో డిప్రెషన్లోకి వెళ్లిపోయానని ఉరేసుకుని చనిపోదాము అని అనిపించిందని తెలిపింది.
తన చావుకు కారణం మాజీ భర్త రితేశ్ కారణం అని చావుకు ముందు సెల్ఫీ వీడియో తీసుకోవాలనుకున్నానని పేర్కొంది.తన మనసును ఎంతగానో గాయపర్చిన అతడిని ఎప్పటికీ క్షమించబోనని అంటోంది రాఖీ సావంత్.తాజాగా ఆమె తన భర్త అదిల్ మాట్లాడుతూ.
తాను స్కిన్ షో చేయడం, పొట్టి పొట్టి దుస్తులు వేసుకోవడం తన భర్తకు ఇష్టం లేదు అన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపిన విషయం తెలిసిందే.తన భర్తకు ఇష్టం లేకపోవడంతో ఆమె పొట్టి దుస్తులు కాకుండా పూర్తిగా కొంచం కంఫర్ట్ గా ఉండే ధరిస్తున్నాను అని తెలిపిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు