ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీపై సంచలన కామెంట్స్ చేశారు.10 సంవత్సరాలలో దేశంలో జరిగిన ఎన్నికలలో 90% పాటు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని తెలిపారు.అటువంటి కాంగ్రెస్ పార్టీ విపక్షాలకి సారథ్యం వహించే అర్హత లేదని చెప్పుకొచ్చారు.అంత మాత్రమే కాక విపక్షాలకి నేతృత్వం వహించడం దేవుడు ఇచ్చే హక్కుగా కాంగ్రెస్ భావిస్తోంది అని కామెంట్లు చేశారు.
గతంలో ప్రశాంత్ కిషోర్ వచ్చే 30 సంవత్సరాలలో దేశంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండదని చెప్పుకొచ్చారు.
అయితే తాజాగా మరోసారి దాదాపు పది సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ దేశంలో 90% ఓడిపోయిందని ప్రశాంత్ కిషోర్ కామెంట్లు చేయడం.
ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో సంచలనంగా మారింది.బీజేపీకి ప్రత్యామ్నాయంగా.ఇటీవల పలు కీలక నాయకులు మమతాబెనర్జీ.శరత్ పవర్ వంటివారు.
థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి పావులు కదుపుతున్నారు.ఇటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ పై ప్రశాంత్ కిషోర్ సోషల్ మీడియాలో కామెంట్లు చేయటం సంచలనంగా మారింది.