టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం బాలీవుడ్ పై ఎక్కువ దృష్టిని పెట్టినట్లుగా అనిపిస్తుంది.తెలుగు లో కాస్త డల్ అవ్వడంతో ఈ అమ్మడి జోరు బాలీవుడ్ లో చూపించాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.
దేశ వ్యాప్తంగా ఇప్పటికే ఈ అమ్మడికి మంచి గుర్తింపు దక్కింది.ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల్లో అవకాశాల కోసం ఈ అమ్మడు తెగ ఆరటంగా ఎదురు చూస్తోంది.
ఈ నేపథ్యంలో హిందీ లో ఈమె వరుసగా సినిమాల్లో నటించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.టాలీవుడ్ నుండి చిన్నా చితకా ఆఫర్లు వస్తున్నా కూడా ఓకే చెప్పడం లేదట.
తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ ల కాంబోలో ఒక సినిమా రాబోతుంది.
ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతుంది.
ఈ సినిమా ను త్వరలోనే పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో మహేష్ బాబు తో నటించేందుకు గాను పూజా హెగ్డే కండీషన్ పెట్టిందనే వార్తలు వస్తున్నాయి.కేవలం 45 రోజులు మాత్రమే ఈ సినిమా కు ఆమె డేట్లు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.అంతకు మించి ఇవ్వలేను అంటూ చెప్పిందట.45 రోజుల్లో షూటింగ్ పూర్తి అయ్యేనా అనేది చూడాలి.
త్రివిక్రమ్ సినిమా ల్లో హీరోయిన్స్ కు పెద్దగా ప్రాముఖ్యత ఉండదు.అందుకే ఈ సినిమా లో ఆమె పాత్రకు సంబంధించిన షూటింగ్ 30 రోజుల్లో కూడా పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.మరో వైపు పాత్ర ఎలాంటిది అయినా కూడా రెండు కోట్ల పారితోషికంతో పాటు తన స్టాప్ కు సంబంధించిన సాలరీ చెల్లించాల్సిందిగా పూజా హెగ్డే కండీషన్ పెట్టిందనే వార్తలు వస్తున్నాయి.హిందీ లో సల్మాన్ ఖాన్ కు జోడీగా నటిస్తున్న విషయం తెల్సిందే.
ఆ సినిమా కు కూడా పూజా హెగ్డే అంతగా కండీషన్స్ పెడుతుందా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.