కరాటే కళ్యాణి గత నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు.ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే కరాటే కళ్యాణి ఇటీవల యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి ని కొట్టి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.
అయితే ఆ వివాదం ఇంకా సద్దుమణిగాక ముందే మరొకసారి ఆమె పేరు వైరల్ అవుతోంది.తాజాగా ఆమె ఇంటిని చైల్డ్ లైన్ అధికారులు పోలీసులు తనిఖీలు చేశారు.
అసలేం జరిగిందంటే.ప్రభుత్వ అనుమతి లేకుండా చిన్నారులను తన ఇంట్లో ఉంచింది అని కరాటే కళ్యాణి పై ఫిర్యాదు రావడంతో చైల్డ్ లైన్ అధికారులు పోలీసులు ఆదివారం ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు.
ఇక సోదాలు నిర్వహించిన అధికారులు తెలిపిన వివరాల మేరకు కరాటే కళ్యాణి గత కొన్ని ఏళ్లుగా అక్రమంగా పిల్లలను తీసుకు వచ్చి ఇంట్లో ఉంచుతోందని,1098 నెంబర్ కు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారని తెలిపారు.సమాచారం అందుకున్న చైల్డ్ లైన్ అధికారులు మహేష్ సంతోష్ కుమార్ ఎర్రగడ్డ డివిజన్ పరిధిలోని రాజీవ్ నగర్ కాలనీ లో శ్రీ లక్ష్మీ నిలయం అపార్ట్మెంట్ కు వెళ్లి కరాటే కళ్యాణి ఇంట్లో సోదాలు నిర్వహించారు.
అయితే అధికారులు వెళ్ళిన సమయానికి కరాటే కళ్యాణి ఇంట్లో పిల్లలు ఆమె ఎవరూ లేరు.కేవలం కళ్యాణి తల్లి మాత్రమే ఉంది.
పోలీసు అధికారులు కళ్యాణి తల్లిని ఎక్కడికి వెళ్ళింది అని విచారించగా తన కూతురు గుడికి వెళ్ళిందని ఎప్పుడు వస్తుందో తెలియదు అని సమాధానం ఇచ్చిందట.అలాగే తన కుమార్తె ఒక పన్నెండేళ్ల బాబు, ఒక ఐదు నెలల పాప ని పెంచుకుంటోందని అందులో తప్పు ఏముంది అంటూ ఆమె నిలదీసిందట.కానీ ఆ పిల్లలు ఎక్కడినుంచి తెచ్చింది అన్న విషయం మాత్రం తనకు తెలియదు అని తెలిపిందట కళ్యాణి మదర్.అయితే కరాటి కళ్యాణి చైల్డ్ లైన్ అధికారులు ఇంటి వద్దకు విచారణకు వస్తున్నారని తెలిసే అలా బయటకు వెళ్లిందా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
మరి కరాటే కళ్యాణి ఎప్పుడు వస్తుంది? ఆమెపై పడ్డ నింద నిజమేనా తెలియాలి అంటే వేచి చూడాల్సిందే మరి.
తాజా వార్తలు