ఎనర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వస్తున్న కార్తికేయ 2పై అంచనాలు భారీగా ఉన్నాయి.ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్కు అద్భుతమైన స్పందన వచ్చింది.
సముద్రం దాచుకున్న అతిపెద్ద రహస్యం.ఈ ద్వారకా నగరం అంటూ హీరో నిఖిల్ వాయిస్ తో వచ్చిన మోషన్ పోస్టర్ ఆసక్తి రేపుతోంది.
కమర్షియల్ చిత్రాలతో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొనసాగిస్తూ విజయాలు సొంతం చేసుకుంటున్న క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.తాజా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.
అద్భుతమైన విజువల్స్, అదిరిపోయే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ట్రైలర్ ఆకట్టుకుంటుంది.
‘శాంతను ఇది నువ్వు ఆపలేని యాగం.
నేను సమిధను మాత్రమే.ఆజ్యం మళ్లీ అక్కడ మొదలైంది.
ప్రాణత్యాగం చేసే తెగింపు ఉంటేనే దీనిని పొందగలం’ అంటూ అదిరిపోయే డైలాగ్తో ఈ ట్రైలర్ మొదలైంది.కాలభైరవ బ్యాగ్రౌండ్ స్కోర్ ట్రైలర్కు అదనపు ఆకర్షణ.
ప్రతీ ఫ్రేమ్ చాలా అద్భుతంగా చూపించారు సినిమాటోగ్రఫర్ కార్తికే ఘట్టమనేని.టెక్నీషియన్స్తో అద్బుతమైన ఔట్ పుట్ తీసుకున్నారు దర్శకుడు చందూ మొండేటి.
కార్తికేయకు సీక్వెల్గా వస్తున్న కార్తికేయ 2 అంచనాలు అందుకోవడం కాదు.మంచిపోయేలా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు చందూ.
ఈ సినిమా అత్యద్భుతమైన విజువల్ ఫీస్టుగా ఉండబోతుందని ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతుంది.ఈ చిత్రంలో ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్.
నిఖిల్ కి జంటగా నటిస్తుంది.ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఈ సినిమాలో ఆసక్తికరమైన విషయం డాక్టర్ కార్తికేయ ప్రయాణం.శ్రీకృష్ణుడు చరిత్రలోకి ఎంటరవుతూ కనిపిస్తున్నారు ఈయన.ఈ చిత్రంలోని భావాన్ని ట్రైలర్ రూపంలో దర్శకుడు చందు మొండేటి ప్రేక్షకుల కళ్ళకు కట్టినట్టు చూపించారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జులై 22న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది కార్తికేయ 2.