సత్యసాయి జిల్లా: చిలమత్తూరు మండలం కొడికొండ లో 2 రోజుల క్రితం అమ్మవారి జాతరలో వైసిపి నాయకులు టీడీపీ నాయకుల పై దాడికి గురైన కుటుంబాలను పరామర్శించడానికి వస్తున్న ఎమ్మెల్యే బాలకృష్ణ కాన్వాయ్ ని అడ్డుకున్న పోలీసులు.బాలకృష్ణ వాహనాన్ని మాత్రమే కొడికొండ గ్రామంలోకి వదిలిన పోలీసులు.
కాన్వాయ్ లేకుండా ఒకే వాహనంలో గ్రామాల్లోకి ప్రవేశించి బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే బాలకృష్ణ. బాలకృష్ణ కాన్వాయ్ను అడ్డుకున్నందుకు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన టిడిపి నాయకులు.
ఎమ్మెల్యే బాలకృష్ణ కామెంట్స్.పులివెందులలో బస్ స్టాండ్ కట్టలేని సీఎం రాష్ట్ర అభివృద్ధి ఎలా చేస్తాడు.కార్యకర్తలను వేధిస్తే దేనికైనా రెడీ.హిందూపురం టిడిపి కార్యకర్తల కోసం అర్థరాత్రి లో అయినా స్పందిస్తా.
వైసీపీ ప్రభుత్వం ఇంటి బయట కాలు పెడితే పన్నులు వసూలు చేస్తున్నారు.వైసీపీ ప్రభుత్వం హద్దులు దాటుతున్నారు.
ఇక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మనం కూడా సిద్ధం కావాలి అని సూచించిన ఎమ్మెల్యే బాలయ్య. వారు మన జోలికి వస్తే మనము అందరూ కలిసికట్టుగా తిరగపడతాం.