అల్లు శిరీష్ హీరోగా ప్రేమ కాదంట అనే సినిమా తెరకెక్కింది.ఆ సినిమా షూటింగ్ పూర్తయి చాలా రోజులైంది.
కానీ కరోనా వల్ల చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోంది.ఆ సినిమా విడుదల ఒక సరైన సమయం చేసే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.
ఇదే సమయం లో ప్రముఖ నిర్మాణ సంస్థ ఓ మల్టీ స్టారర్ సినిమా ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.అందులో అల్లు శిరీష్ మరియు శ్రీ విష్ణు హీరోలు గా కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కానీ అసలు విషయం ఏంటంటే ఆ సినిమాలో ఇద్దరు హీరోలుగా కనిపించబోవడం లేదు.అల్లు శిరీష్ హీరోగా నటించబోతున్న ఆ సినిమా లో శ్రీ విష్ణు విలన్ పాత్ర లో కనిపించబోతున్నాడు గా సమాచారం అందుతోంది.
ఇప్పటికే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమా ల్లో నటించి మెప్పించిన శ్రీ విష్ణు మొదటి సారి అల్లు శిరీష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు.ఈ సినిమా లో ఆయన విలన్ గా కనిపించబోతున్న నేపథ్యంలో అందరి దృష్టి ఈ సినిమా పై ఉంది.వీరిద్దరి కాంబినేషన్లో ఒక యంగ్ డైరెక్టర్ మంచి లవ్ కమ్ డ్రమెటిక్ స్టోరీ ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను సినిమా గా రూపొందించబోతున్నట్లు గా తెలుస్తోంది.అల్లు శిరీష్ కమర్షియల్ గా ఒక మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు.
ఈ సమయం లో ఆయనకు ఇలాంటి ఒక మంచి మల్టీ స్టారర్ మూవీ రావడం జరిగింది అంటూ వార్తలు వస్తున్నాయి.ఈ సినిమా ఒక విభిన్నమైన కథతో ఉంటుందని అంటున్నారు.
తప్పకుండా ఈ సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలను అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు నిర్మాణ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది.
అల్లు శిరీష్ హీరో గా ఇప్పటికే రూపొందిన ప్రేమ కాదంట సినిమా విడుదలైన కొన్ని రోజులకే ఈ సినిమా ను కూడా విడుదల చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.