తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి ఫ్యామిలీ నుండి వచ్చిన ముద్దుగుమ్మ కీర్తి సురేష్.తమిళంలో ఎంట్రీ ఇచ్చిన ఈమె మహానటి సినిమా తో తెలుగు ప్రేక్షకులకు చేరువ అయ్యి వెంటనే పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
కొన్ని ఏళ్ల క్రితం ఈ అమ్మడు చాలా బొద్దుగా ఉండేది.కాని ఇప్పుడు ఈ అమ్మడు చాలా సన్నగా మారింది.
కొన్ని ఫొటో షూట్స్ లో ఈ అమ్మడు అందంగా కనిపిస్తూ ఉంటే కొన్ని ఫొటో షూట్స్ లో మాత్రం ఈ అమ్మడు మరీ సన్నగా ఉందంటూ విమర్శలు వస్తున్నాయి.తాజాగా ఈ అమ్మడు మేకప్ లేకుండా ఉన్న ఫొటోలను షేర్ చేసింది.
ఆ ఫొటోలు కాస్త కీర్తి సురేష్ ట్రోల్ అయ్యేలా చేశాయి.ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న కీర్తి సురేష్ మేకప్ లేని ఫొటోలు వైరల్ అవుతుండగా కీర్తి సురేష్ ఏంటీ ఇలా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.
ఈమె మేకప్ లో అందంగా కనిపించేది.కాని మేకప్ లేకుండా ఈమె అంత అందంగా కనిపించడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తానికి ఈ అమ్మడు అందం విషయంలో ప్రస్తుతం జరుగుతున్న చర్చ సోషల్ మీడియాలో చర్చకు తెర తీసింది.ఈమె హీరోయిన్ గా సర్కారు వారి పాట చిత్రీకరణ లో పాల్గొంటుంది.ఇంతే కాకుండా ఈమె తమిళం మరియు ఇతర భాషల్లో కూడా నటిస్తున్న విషయం తెల్సిందే.పెద్ద ఎత్తున అంచనాలున్న సర్కారు వారి పాట సినిమా సమ్మర్ లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.
పెద్ద ఎత్తున అంచనాలున్న తమిళ సినిమా లో కూడా ఈమె హీరోయిన్ గా నటిస్తోంది.హిందీ లో కూడా ఈమెకు ఆఫర్లు వస్తున్నాయి.చిరంజీవికి చెల్లి గా భోళా శంకర్ సినిమా లో ఈమె నటించబోతున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఆ సినిమా లో చిరంజీవి కి చెల్లిగా చాలా నాచురల్ పాత్రలో ఆమె కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.