రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టమే.మహారాష్ట్ర రాజకీయాలనే ఉదాహరణగా తీసుకుంటే నిన్నటి వరకు మంత్రిగా ఉన్న ఏక్నాథ్ షిండే ఇప్పుడు సీఎం అయిపోయారు.
ఆయన సీఎం అవుతారని అంతకుముందు ఎవరూ కలలోనైనా ఊహించలేదు.అలాగే పార్టీల మార్పుతో రాత్రికి రాత్రే పదవులు పొందిన రాజకీయ నేతలు చాలా మంది ఉన్నారు.
పదవులు రాకపోవడంతో పార్టీలు మారిన నేతలు కూడా ఉంటారు.
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలను పరిగణనలోకి తీసుకుంటే మహిళా నేత విజయారెడ్డి ఇటీవల టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం హాట్ టాపిక్గా మారింది.
టీఆర్ఎస్లో తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వకపోవడం, చివరకు మేయర్ పీఠం కూడా దూరం కావడంతో ఆమె విసిగి వేసారి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు.అయితే ఆమె పార్టీ మారడం సొంత అన్నయ్య సీటుకు ఎసరు తెచ్చేలా ఉంది.
ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం టికెట్ కోసం అక్కా తమ్ముళ్ల మధ్య వార్ మొదలైంది.
జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పీజేఆర్ కుమారుడు విష్ణువర్ణన్ రెడ్డి, కుమార్తె విజయారెడ్డి అక్కాతమ్ముళ్లు.
అయితే కొద్దిరోజుల కిందటి వరకు వేర్వేరు పార్టీలలో ఉన్న వీళ్లిద్దరూ ఇప్పుడు ఒకే పార్టీలో ఉండటంతో కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపింది.ఎప్పుడైతే విజయారెడ్డి పార్టీలో చేరారో వెంటనే తన సీటుకు ఎసరు వస్తుందని విష్ణువర్ధన్రెడ్డి అలర్ట్ అయ్యారు.
తాను పార్టీలో ఉండగా తనకు చెప్పకుండా తన సోదరిని ఎందుకు చేర్చుకున్నారంటూ రేవంత్పై విష్ణువర్ధన్రెడ్డి మండుతున్నాడు.
అసలే ఒకవైపు జగ్గారెడ్డి వర్సెస్ రేవంత్ రాజకీయాలు నడుస్తుండగా.ఇప్పుడు విజయారెడ్డి వర్సెస్ విష్ణువర్ధన్రెడ్డి మధ్య రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో కాక పుట్టిస్తున్నాయి.తాజా పరిణామాలతో విష్ణువర్ధన్రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరతారనే ఊహాగానాలు ప్రారంభమయ్యాయి.
దీంతో తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేశారు విష్ణువర్ధన్రెడ్డి.ఇకపై పార్టీలో యాక్టివ్గా ఉంటానని తెలిపారు.
పార్టీ తనకు పదవులు ఇస్తే పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.