టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ కాజల్ కాంబినేషన్ లో తెరకెక్కిన డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయనే సంగతి తెలిసిందే.ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కావడంతో ఈ కాంబినేషన్ ను రిపీట్ చేయాలని చాలామంది భావించారు.
అయితే మిస్టర్ పర్ఫెక్ట్ తర్వాత ప్రభాస్ కాజల్ కలిసి నటించలేదు.ప్రభాస్ రెండు సినిమాలను కాజల్ అగర్వాల్ రిజెక్ట్ చేశారు.
ప్రభాస్ హీరోగా లారెన్స్ డైరెక్షన్ లో తెరకెక్కిన రెబల్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ రిజల్ట్ ను అందుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో తమన్నా, దీక్షా సేథ్ హీరోయిన్లుగా నటించారు.
అయితే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ రోల్ కోసం మేకర్స్ మొదట కాజల్ ను సంప్రదించారు.అయితే కాజల్ మాత్రం రెబల్ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపకపోవడంతో ఆ తర్వాత తమన్నా ఎంపిక కావడం జరిగింది.
ఆ తర్వాత ప్రభాస్ హీరోగా సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కిన సాహో సినిమాలో కాజల్ అగర్వాల్ కు స్పెషల్ సాంగ్ చేసే ఆఫర్ వచ్చింది.అయితే కాజల్ ఆ ఆఫర్ కు కూడా నో చెప్పడం గమనార్హం.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కాజల్ రిజెక్ట్ చేసిన ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ కాలేదు.కథల విషయంలో కాజల్ జడ్జిమెంట్ ఎంత పర్ఫెక్ట్ అనే విషయం ఈ ఘటనతో ప్రూవ్ అవుతోంది.
సాధారణంగా చాలామంది హీరోలు స్టార్ హీరోల సినిమాలలో ఆఫర్ అంటే కథ నచ్చినా నచ్చకపోయినా రిజెక్ట్ చేయరు.కానీ కాజల్ మాత్రం కథకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ స్థాయికి చేరుకున్నారు.సినిమాసినిమాకు కాజల్ అగర్వాల్ కు క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.కాజల్ అగర్వాల్ తర్వాత సినిమాలతో కూడా విజయాలను అందుకోవాలని ఆమె ఫ్యాన్స్ భావిస్తున్నారు.అయితే కాజల్ వరుసగా సినిమాల్లో నటిస్తారో లేదో క్లారిటీ రావాల్సి ఉంది.