ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ మేజర్ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదలై నాలుగో వారంలోకి అడుగు పెట్టినప్పటికీ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది.ఇకపోతే ఈ సినిమా చూసిన ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు మేజర్ చిత్రబృందం పై ప్రశంసలు కురిపించడమేకాకుండా ఘనంగా సత్కారాలు కూడా చేశారు.
ముంబై దాడులలో టెర్రరిస్టులతో వీర పోరాటం చేస్తూ దేశ రక్షణలో అమరులైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సినిమా పై ప్రశంసల వర్షం కురిపించారు.
శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరించారు. శశికిరణ్ సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని అడివి శేష్ సందీప్ పాత్రలో ఒదిగిపోయాడని ఎంతోమంది ఈయన నటన పై ప్రశంసలు కురిపించారు.
ఇదిలా ఉండగా ఈ సినిమా జూన్ 3వ తేదీ విడుదలయి ఇప్పటికే నాలుగు వారాలు కావడంతో ఈ సినిమా విజయంపై మరోసారి అడవిశేషు స్పందిస్తూ… కరోనా సమయంలో తాను మేజర్ సినిమా గురించి ఒక ప్రామిస్ చేశాను… ఈ సినిమాను ఎలాగైనా థియేటర్లోకి తీసుకువస్తానని ఆరోజు ప్రామిస్ చేశాను అయితే నేను ప్రామిస్ చేసిన మాటను నిలబెట్టుకున్నాను అంటూ అడవి శేష్ ట్వీట్ చేశారు.ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ సినిమాలో అడవి శేష్ సరసన సాయి మంజ్రేకర్, శోభిత హీరోయిన్లుగా నటించారు.