ఇటీవల 2024 ఎన్నికలలో చంద్రబాబుపై పోటీకి హీరో విశాల్ నీ వైసీపీ రంగంలోకి దింపుతున్నట్లు వార్తలు వచ్చాయి.తెలుగు ప్రాంతానికి చెందిన విశాల్ కుటుంబ సభ్యులు బంధువులు చిత్తూరు ఆ ప్రాంతాలలో ఉన్నట్లు ఆ ప్రాతిపదిక పైన.
వైసీపీ తరపున పోటీకి దించుతున్నట్లు వార్తలు వచ్చాయి.అయితే వచ్చిన ఈ వార్తలపై హీరో విశాల్ క్లారిటీ ఇచ్చారు.
ఈ క్రమంలో చంద్రబాబుపై పోటీ.ఏపీ రాజకీయాలలో ఎంట్రీ అంటూ వస్తున్న వార్తలలో వాస్తవం లేదని కొట్టి పారేశారు.
ఈ వ్యవహారం దిశగా ఇప్పటివరకు తనని ఎవరూ కూడా సంప్రదించలేదని తెలిపారు.ఏపీ రాజకీయాల్లో ప్రవేశించే ఉద్దేశమే లేదు.
దృష్టి మొత్తం సినిమాలు పైనే ఉందని అన్నారు.ఇక ఇదే సమయంలో కొద్ది రోజుల క్రితం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా.
వచ్చే ఎన్నికలలో పార్టీ తరపున హీరో విశాల్ పోటీ చేస్తున్నట్లు వస్తున్నా వార్తలలో వాస్తవం లేదని కొట్టి పారేశారు.ఈ వార్తలను ఖండిస్తూ ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం క్లారిటీ ఇచ్చారు.
తాజాగా విశాల్ కూడా క్లారిటీ ఇవ్వటంతో విశాల్…పోటీ వార్తలకు పుల్ స్టాప్ పడినట్లు అయింది.