టాలీవుడ్ హీరోలలో ఒకరైన గోపీచంద్ పక్కా కమర్షియల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పక్కా కమర్షియల్ టీమ్ తో కలిసి టీవీ షోలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.తాజాగా క్యాష్ ప్రోమో రిలీజ్ కాగా ఈ షోకు గోపీచంద్, మారుతి, బన్నీవాసు, ఎస్కేఎన్ హాజరయ్యారు.
సుమ గోపీచంద్ తో సినిమా చాలా పెద్ద సక్సెస్ కావాలని పూజ చేశామని ఇదిగోండి ప్రసాదం అని చెబుతూ ప్రసాదం ఇస్తుంది.
పూజ చేసినందుకు డబ్బులు ఇవ్వాలని నేను కూడా పక్కా కమర్షియల్ అని సుమ అడగగా మా ప్రొడ్యూసర్ గారు డబ్బులు ఇస్తారని గోపీచంద్ చెబుతారు.
సుమ బన్నీవాసుతో ఫుల్లుగా మీరు డబ్బులు లెక్కపెట్టుకోవడానికి క్యాలిక్యులేటర్ ఇచ్చానని మరి డబ్బులు అని అడగగా తాను పర్సు మరిచిపోయానని చెబుతూ బన్నీవాసు సుమకు రివర్స్ లో షాకిచ్చారు.సుమ మారుతికి అలారం ఇచ్చి డబ్బులు అడగగా నేను అడగకుండానే అమ్మేస్తున్నారని మారుతి చెబుతాడు.
ఇవి వెల్కం గిఫ్ట్ లని సుమ చెప్పగా గిఫ్ట్ లని చెప్పి డబ్బులు అడుగుతున్నారని గోపీచంద్ వెల్లడించారు.
క్యాష్ షోలో తండ్రి ఫోటోను సుమ చూపించగా గోపీచంగ్ ఎమోషనల్ అయ్యారు.నాకు తొమ్మిది సంవత్సరాల వయస్సు ఉన్న సమయంలో నాన్న చనిపోయారని గోపీచంద్ కామెంట్లు చేశారు.నాన్న బ్రతికున్న సమయంలో ఎక్కువ సమయం గడపలేదని ఇప్పుడు నాన్న విలువ ఏంటో తెలుస్తుందని గోపీచంద్ వెల్లడించారు.
జులై 1వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుండగా ఈ సినిమాతో గోపీచంద్ పక్కా కమర్షియల్ హిట్ ను సాధిస్తారో లేదో చూడాల్సి ఉంది.ఈ ప్రోమోకు దాదాపుగా 8 లక్షల వ్యూస్ వచ్చాయి.జులై నెల 2వ తేదీన ఈ ఎపిసోడ్ బుల్లితెరపై ప్రసారం కానుందని సమాచారం అందుతోంది.