వేడి పాలు త్రాగటం వలన కలిగే ప్రయోజనాలు తెలిస్తే... రోజు పాలను త్రాగుతారు
TeluguStop.com
ఒక కప్పు వేడి పాలు శక్తిని ఇవ్వటమే కాకుండా తాజాగా ఉండేలా చేస్తుంది.
పాలల్లో విటమిన్లు, కాల్షియం, ప్రొటీన్, నియాసిన్, ఫాస్పరస్, పొటాషియం
సమృద్ధిగా ఉంటాయి.ప్రతి రోజు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలను త్రాగితే
ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు.
ఒకవేళ పాల ఉత్పత్తుల ఎలర్జీ
ఉంటే డాక్టర్ ని సంప్రదించండి.పాల ఉత్పత్తులు పడని వారికి సొయా పాలను
సూచిస్తున్నారు.
రాత్రి పడుకొనే సమయంలో వేడి పాలను త్రాగటం వలన నిద్రలేమి సమస్య దూరం
అయ్యి నిద్ర బాగా పడుతుంది.
ఏదైనా పని చేసి బాగా అలసినప్పుడు గోరువెచ్చని పాలను త్రాగితే అలసట అంతా
తగ్గిపోతుంది.
మానసిక ప్రశాంతత దొరుకుతుంది.iframe Width="560" Height="315" Src="https://!--wwwyoutube!--com/embed/CPQHdgyZoYg" Frameborder="0" Allow="autoplay; Encrypted-media" Allowfullscreen/iframe
గొంతు సంబంధ సమస్యలను తగ్గించటంలో వేడి పాలు బాగా సహాయపడతాయి.
గొంతు
సమస్యలు ఉన్నప్పుడు వేడి పాలలో చిటికెడు మిరియాల పొడి కలిపి త్రాగాలి.
పాలు శరీరంలో నీటి శాతాన్ని సమతుల్యం చేస్తుంది.వ్యాయామం చేసిన వెంటనే
ఒక గ్లాస్ వేడి పాలను త్రాగటం మంచిది.
వేడి పాలను త్రాగితే అప్పటివరకు ఉన్న అలసట,నిస్సత్తువ తగ్గి హుషారుగా ఉంటారు.జీర్ణ సమస్యలతో బాధపడేవారు ఒక గ్లాస్ వేడిపాలను త్రాగితే ఆ సమస్యాలు
నుండి బయటపడవచ్చు.
ముఖ్యంగా మలబద్దక సమస్య నుండి బయటపడవచ్చు.ఎముకలు,పళ్ళు బలంగా ఆరోగ్యంగా ఉండాలంటే కాల్షియం చాలా అవసరం.
కాల్షియం
పాలలో సమృద్ధిగా ఉండుట వలన ఎముకలు,పళ్ళు బలంగా ఆరోగ్యంగా ఉండేలా
చేస్తుంది.
ఏపీలో అవినీతి లేని ప్రభుత్వం కూటమితోనే సాధ్యం..: రాజ్నాథ్ సింగ్