మ్యాచో స్టార్ గోపీచంద్ కు టాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.టాలీవుడ్ మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు సంపాదించుకున్న హీరోల లిస్టులో గోపీచంద్ కూడా ఉన్నారు.
ఈయన హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నాడు.తన లాస్ట్ సినిమాను గోపీచంద్ సంపత్ నంది డైరెక్షన్ లో చేసాడు.
సీటిమార్ సినిమాతో ప్రేక్షకుల చేత సీటిమార్ వేయించాడు.
గోపీచంద్ సీటిమార్ సినిమా హిట్ తర్వాత మారుతీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.
పక్కా కమర్షియల్</emపేరుతొ ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో గోపీచంద్ కు జోడీగా రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ సినిమా నుండి ఎప్పటి కప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్ లను ఇస్తూనే ఉన్నారు.
ఈ సినిమా జులై 1న రిలీజ్ కాబోతున్న సందర్భంగా వరుస ప్రొమోషన్స్ చేస్తూ ఈ సినిమాపై మరింత ఆసక్తిని కలిగిస్తున్నారు.ఇక రిలీజ్ కు రెండు రోజులే ఉండడంతో ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకున్నట్టు మేకర్స్ తెలిపారు.ఈ సినిమాకు సెన్సార్ బోర్డు వారు U/A సర్టిఫికెట్ ను జారీ చేసారు.అలాగే రన్ టైమ్ కూడా లాక్ అయ్యింది.పక్కా కమర్షియల్ సినిమా రన్ టైం 2 గంటల 32 నిముషాలుగా కట్ చేసారు.మరి ప్రేక్షకులను ఈ సినిమా ఎలా అలరిస్తుందో వేచి చూడాల్సిందే.
ఇక ఈ సినిమాను యువీ క్రియేషన్స్, జీఏ 2 బ్యానర్ లపై సంయుక్తంగా నిర్మించగా.జేక్స్ బెజోయ్ సంగీతం అందించారు.
తాజా వార్తలు