రాష్ట్రంలో తుగ్లక్ ముఖ్యమంత్రి పరిపాలనలో ఉదయం లేస్తే ఏ దోపిడీ జరుగుతుందో ఎవరికీ అర్ధంకావట్లేదు.ఎప్పుడో ఎన్ టి రామారావు గారు టైములో 39 సం.
ల క్రితం నుంచి పేదవాళ్ళకి ఇల్లులు ఇచ్చుకుంటూ వస్తున్నాము.రామారావు గారే కాదు…అప్పటి నుండి పనిచేసిన ముఖ్యమంత్రులు అందరు కూడా ఇల్లులు ఇచ్చారు.
ఇప్పుడు ఆ ఇల్లులు అన్నిటికి కూడా OTS పేరుతో రిజిస్ట్రేషన్ నిర్ణయం మూర్ఖత్వం.ఆ ఇల్లులకు ఇంటి పన్ను , కరెంటు బిల్లు కడుతున్నారు.MRO రిజిస్టేషన్ చేస్తే ఆ రిజిస్టేషన్ ఎలా వర్తిస్తుంది.సబ్ రిజిస్టేషన్ ఆఫీసులో కదా రిజిస్టేషన్ చెయ్యాలి.
మున్సిపాలిటీలో అయితే 15 వేల రూపాయిలు, పంచాయితీలో అయితే 10వేల రూపాయిలు , కార్పొరేషన్ లో అయితే 20 వేల రూపాయిలు కట్టమన్నారు.OTS నిర్ణయాన్ని ప్రజలందరు వ్యతిరేకిస్తున్నారు.
విశాఖపట్నం జిల్లాలో మొత్తం లబ్దిదారులు 1 లక్షా 23వేల 8 వందల 75 మంది ఉంటే అందులో కేవలం 15 వేల మందే కట్టారు.మిగతావాళ్ళు కట్టలేమని ధైర్యంగా చెప్పుతున్నారు.
ప్రజల వ్యతిరేకంతో ఈ OTS వసూలు కార్యక్రమాన్ని డ్వాక్రా గ్రూపు మహిళకు అప్పగించారు.కట్టకపోతే మీ డ్వాక్రా గ్రూపుల్లో మీరు దాచుకున్న డబ్బుని తీసుకోవడాని ప్రయత్నం చేస్తున్నారు.
డ్వాక్రా గ్రూపులలో ఉన్న డబ్బులను RP ల ద్వారా, గ్రామాల్లో అయితే CAల ద్వారా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.కాబట్టి దయచేసి మీరు ఎవరూ ఈ OTS కట్టకండి.
మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది.ఈ దోపిడిని అరికట్టడం కోసం పార్టీలకు అతీతంగా నాయకులందరూ ప్రజలకు అవగాహన కల్పించాలి
.