మంగళగిరి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.అధికారంలోకి వస్తే ప్రత్యర్థులపై ఈ రీతిగా వేధింపులకు గురి చేయవచ్చు అని జగన్ పాలన చూసి నేర్చుకున్నట్లు.
రాబోయేది టీడీపీ ప్రభుత్వమని పేర్కొన్నారు.ఈ క్రమంలో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని పోలీసులపై మండిపడ్డారు.
600 మంది పై అక్రమ కేసులు పెట్టారని… నోటీసులవ్వకుండా అరెస్టు.చేస్తున్నారని ధ్వజమెత్తారు.
కొంతమంది పోలీసు అధికారులు కూడా సైకో మాదిరిగా.నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల.సాంబశివరావు, వెంకటేష్ ల ఇళ్లకు.
వెళ్లి.పోలీసులు గోడలతోపాటు లైట్లు పగలగొట్టడం ఏంటి అని చంద్రబాబు నిలదీశారు.
ఈ రీతిగా వ్యవహరించిన పోలీస్ అధికారులపై వచ్చే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు.