దర్శకుడు రజనీష్ ఘాయ్ దర్శకత్వంలో కంగనా రనౌత్, అర్జున్ రాంపాల్ కలిసి నటించిన తాజా చిత్రం ధాకడ్.ఇందులో దివ్య దత్త, షరీబ్ హష్మీ, శాశ్వత చటర్జీ కీలక పాత్రలో నటించారు.
ఈ సినిమా మే 20న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం అందరికి తెలిసిందే.ఇకపోతే విడుదల తేదీకి మరికొన్ని గంటల సమయం ఉండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేసింది.
ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా కంగనారనౌత్ మాట్లాడుతూ యూరప్ లో ఒంటరి ప్రయాణికురాలిగా తనకు ఎదురైన ఒక బాధాకరమైన సంఘటన గురించి పంచుకుంది.స్విజర్లాండ్ లో సోలో ట్రావెల్స్ లో తన విలువైన వస్తువులను దొంగిలించారని తెలిపింది.
ఇది యూరప్ లో చెడు వైపు చూపిస్తుందని కూడా తెలిపింది.డబ్బు సంపాదించడం ప్రారంభించినప్పుడు ఒంటరిగా ప్రయాణించడం తనకు చాలా ఇష్టం అని తెలిపింది.అయితే యూరప్ లో జరిగిన చేదు జ్ఞాపకాలు మాత్రమే కాకుండా తీపి జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకుంది.ఫ్రాన్స్ లో కప్పలను తినడం.
అలాగే సెయింట్ మోరిట్జ్ లో తన విలువైన వస్తువులను దొంగతనం చేయడం.అలాగే కలర్ ఫుల్ డేస్ కథలను గుర్తు చేసుకుంది.
అంతేకాకుండా ఆమె యూరప్లో నెలలతరబడి అక్కడే నివసించిదట.అలాగే మెక్సికోలో కూడా కొంత సమయాన్ని గడిపినట్లు తెలిపింది.
అలాగే ఆమె తన ఇంగ్లీష్ మాజీ బాయ్ ఫ్రెండ్ తో కలసి స్థానిక ఫ్రెంచ్ వంటకాలను తిన్న విషయాన్ని కూడా గుర్తుచేసుకుంది. బెచరోన్ కో బెటర్ మే ఫ్రై కియా హువా థా అని నేను అతనిని అడిగాను.అప్పుడు అతను మీరు ఈ కప్పలను తినాలి అనుకుంటున్నారా.ఔర్ ఖాయే ఉస్నే.మేరే లియే కాఫీ షాకింగ్ థా వో.అయితే అప్పటికి కంగనా బ్రిటీష్ డాక్టర్ నికోలస్ లాఫెర్టీతో రిలేషన్ షిప్ లో ఉందట.అతడితో కలిసి కప్పలు తిన్నాను అని చెప్పుకొచ్చింది కంగనా.