ఏపీ రాష్ట్ర అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు బీజేపీ నేతలు. పార్టీలతోనూ ప్రస్తుతమున్న ప్రభుత్వాలతోనూ సంబంధంలేకుండా అన్ని రాష్ట్రాలను కేంద్రం సమ దృష్టితో చూస్తుదని చెబుతున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదాపై మాట్లాడని పీఎం పలు ప్రాజెక్టుల అభివృద్ధి కోసం నిధులును సంపూర్ణంగా విడుదల చేయడానికి కేంద్రం చిత్తశుద్ధితో ఉందన్నారు ఆ పార్టీ నేతలు.ముఖ్యంగా యువత ప్రోత్సాహాకానికి మేక్ ఇన్ ఇండియా ను పరిచయం చేసామన్నారు.
పోలవరం, ప్రాజెక్టు అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.
మరోవైపు సాదాసీదా కొనసాగిన ఆయన ప్రసంగం లో చివరి నిముషాల్లో మాత్రం పార్టీ కార్యాచరణపై కార్యకర్తలు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.
ఏపీలో బీజేపీ స్టేండ్ పై రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతోపాటు తదితర ప్రముఖ నాయకులతోనూ చర్చించనట్లు సమాచారం.రాబోయే ఎన్నికలపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలంటూ ఆయన పార్టీ కార్యకర్తలను కోరారు.
ప్రధాని మోదీ టూర్ ఏపీలో కొనసాగిన తీరు పట్ల విశ్లేషకుల్లో భిన్న స్వరాలు వినిపిపిస్తున్నాయి.ముఖ్యంగా ఏపీలో ప్రధాని టూర్ పై నిరసనలు వ్యక్తం చేస్తూ గాలిలో ఎగరేసిన నల్ల బెలూన్ లపై పెద్ద ఎత్తున ఆందోళనలే చెలరేగాయి.
ప్రధాని వస్తున్న హెలీకాప్టర్ మార్గంలోనే ఈ బెలూన్ లు ఎగరడం గమనార్హం.దాంతో ఏపీ లో ఇంటెలిజెన్స్ వర్గాల వైఫల్యం మరోసారి బయట పడ్డది.ఏపీలో ప్రధాని టూర్ లోని ప్రత్యేక విశేషం ఏంటంటే మన్యం వీరుడి కుటుం సంభ్యులకు పాదాభివందనం ఒక హైలెట్ నిలిస్తే.పార్టీ అధికారం లోకి తీసుకురావడానికి పార్టీ శ్రేణులకిచ్చిన సూచనలు అంతర్గతంగానే ఉండిపోయాయనే వాదన విశ్లేషకుల్లో బలంగా వినిపిస్తుంది.
ఈ నేపథ్యంలోనే రాబోయే ఎన్నికల్లో బీజేపీ స్టేండ్, పవర్ ఏవిధంగా ఉండబోతుందో చూడాలంటూ పార్టీ శ్రేణుల్లో చర్చలు మొదలైయ్యాయి.