ఈ మధ్యకాలంలో రిలీజ్ అవుతున్న సినిమాలకు మేజర్ ఆదాయ మార్గంగా ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ మారిన విషయం తెలిసిందే.అయితే ఇది వరకు పెద్ద హీరోల సినిమాలకు కాస్త అటు ఇటుగా ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం ఏకంగా ప్రజల నుండి వందల కోట్ల వరకూ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ రేట్లు పలుకుతున్నాయి.
అయితే మామూలుగా సినిమాలను ఎక్కువ శాతం ఒకే ఒక్క ఊరికి సంస్థకు ఇవ్వడం జరుగుతుంది.కానీ ప్రస్తుతం మాత్రం సినిమాలు రెండు ఓటీటీ లు కలిపి తీసుకుంటున్నాయి.
అయితే ఈ విషయంలో బాలీవుడ్ పద్ధతిని ఫాలో అవుతూ తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా ప్రస్తుతం అదే పద్ధతి కొనసాగుతోంది.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మరియు ఆహా ఓటీటీలు స్ట్రీమింగ్ చేసిన విషయం తెలిసిందే.
ఇక పై రెండు ఓటీటీ లు కలసి ఒక సినిమాను స్ట్రీమింగ్ చేయడం అన్నది కంటిన్యూగా జరగబోతున్నట్లు తెలుస్తోంది.అదే తరహాలో తాజాగా టాలీవుడ్ హీరో గోపీచంద్ రాశి ఖన్నా నటించిన సినిమా కూడా నడుస్తోంది.
మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ వారంలోనే థియేట్రికల్ రిలీజ్ కు రెడీ గా ఉన్నా పక్కా కమర్షియల్ చిత్రం కు సంబంధించిన అప్డేట్ కూడా వచ్చింది.
ఈ పక్కా కమర్షియల్ సినిమాను నెట్ ఫ్లిక్స్ తో పాటుగా ఆహా ఓటీటీ సంస్థ కూడా కొనుగోలు చేసిందట.నిర్మాత బన్నీ వాసు సినిమా కనుక ఆహలో స్ట్రీమింగ్ అవ్వడం అన్నది సాధారణ విషయం.అయితే నెట్ ఫిక్స్ వారు కూడా కొంత మొత్తం ఇచ్చేందుకు ముందుకు రావడంతో అందులో కూడా స్ట్రీమింగ్ కు అనుమతి ఇస్తూ నిర్మాత బన్నీవాసు నిర్ణయం తీసుకున్నారు అని తెలుస్తోంది.అంటే పక్కా కమర్షియల్ సినిమా కూడా భీమ్లా నాయక్ సినిమా తరహాలో నడుస్తోందన్నమాట.
తాజా వార్తలు