వెండి ప్లేట్ లో భోజనం చేస్తే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
TeluguStop.com
మారుతున్న జీవనశైలి,మారుతున్న కాలాన్ని బట్టి మనం కూడా ఇట్టే
మారిపోతున్నాం.మన పెద్దలు భోజనం చేయటానికి రాగి, ఇత్తడి, వెండి, బంగారం
వంటి లోహాలతో తయారుచేసిన ప్లేట్స్ ఉపయోగించేవారు.
కానీ మనం మాత్రం భోజనం
చేయటానికి పింగాణీ, ప్లాస్టిక్, స్టీల్ వంటి పదార్ధాలతో చేసిన ప్లేట్లను
ఉపయోగిస్తున్నాం.
కానీ ఇలా పింగాణీ, ప్లాస్టిక్, స్టీల్ ప్లేట్స్ వాడటం
అంత మంచిది కాదు.రాగి, ఇత్తడి, వెండి, బంగారం వంటి లోహాలతో తయారుచేసిన
ప్లేట్స్ లో భోజనం చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
ఇప్పుడు వాటి
గురించి వివరంగా తెలుసుకుందాం.వెండి ప్లేట్
వెండితో తయారు చేసిన ప్లేట్లలో భోజనం చేయటం వలన కంటికి సబంధించిన
వ్యాధులు రావు.
కంటి చూపు మెరుగుపడటమే కాకుండా కళ్ళు చాలా ఆరోగ్యంగా
ఉంటాయి.అంతేకాకుండా జీర్ణాశయ సంబంధ సమస్యలు కూడా రాకుండా వెండి
కాపాడటంలో సమర్ధవంతంగా పనికెహ్స్తుంది.
Iframe Width="560" Height="315" Src="https://!--wwwyoutube!--com/embed/aguFI93TVYs" Frameborder="0" Allow="autoplay; Encrypted-media" Allowfullscreen/iframe
బంగారు ప్లేట్
మనం వాడే లోహాలన్నింటిలోను బంగారం చాలా ఖరీదైనది.
అలాగే మన ఆరోగ్యానికి
కూడా చాలా ముఖ్యమైనది.ఆయుర్వేదంలో బంగారం ప్లేట్ లో తినేవారికి ఎటువంటి
వ్యాధులు రావని చెప్పుతారు.
బంగారం ప్లేట్ లో తింటే ఎటువంటి అనారోగ్యాలు
దరికి చేరవు.రాగి ప్లేట్
రాగితో తయారుచేసిన ప్లేట్లలో భోజనం చేయటం వలన ఆరోగ్యంగా ఉండటమే కాకుండా
శరీరం చాలా బలంగా ఉంటుంది.
శరీరంలో ఇన్ ఫెక్షన్స్ ని తరిమి కొట్టే
లక్షణాలు సమృద్ధిగా రాగిలో ఉన్నాయి.అందుకే ఈ రోజుల్లో చాలా మంది మంచి
నీటిని నిల్వ చేయటానికి రాగి పాత్రలను వాడుతున్నారు.
ఇత్తడి ప్లేట్
ఇత్తడి ప్లేట్లలో భోజనం చేయటం వలన జీర్ణాశయంలో ఉన్న క్రిములు మొత్తం
నశిస్తాయి.
దీంతో జీర్ణాశయం శుద్ది జరగడమే కాకుండా శ్వాసకోశ వ్యాధులకు
చెక్ పెట్టొచ్చు.శరీర దృఢత్వాన్ని పెంచటంలో కూడా సహాయపడుతుంది.
ట్రాఫిక్ రోడ్లపై పరుగెత్తుతూ భయపెట్టిన ఆర్మీ గుర్రాలు.. వీడియో వైరల్..