ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో పాల్గొన్న బాలకృష్ణ పామర్రు మండలం నిమ్మకూరులో శత జయంతి ఉత్సవాలను ప్రారంబించిన బాలకృష్ణ గ్రామస్తులు ,అభిమానులతో ముచ్చటించిన బాలకృష్ణ.ఉదయం నిమ్మకూరులోని ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పూజాకార్యక్రమాలు నిర్వహించిన బాలకృష్ణ.
ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను పురస్కరించుకొని గ్రామం మొత్తం ఎన్టీఆర్ నటించిన ఫ్లెక్సీలతో నింపేసిన అభిమానులు.నందమూరి బాలకృష్ణ తల్లిదండ్రులు అంటే పార్వతీపరమేశ్వరుకు లాంటి వారు యన్టీఆర్ జయంతిని తెలుగువారంతా ఘనంగా జరుపుకుంటారు ప్రపంచ పటంలో తెలుగు సంతకం, ఆత్మగౌరవ నిలబెట్టిన మహనీయుడు నేటి నుండి శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం ఆనందంగా ఉంది.
యన్టీఆర్ ఇల్లే ఒక నటనాలయం యన్టీఆర్ అందరి గుండెల్లో ఉన్నారు సామాన్య రైతుగా, ప్రభుత్వం ఉద్యోగిగా, కళాకారునిగా, సిఎంగా ఎన్నో సేవలు అందించారు సామాజికం, పౌరాణికం ప్రతికూల పాత్రలను పోషించారు తెలుగు వారి ఆత్మగౌరవం నిలబెట్టేలా నేనున్నాను అని ముందుకు వచ్చారు.
శ్రామికులు, రైతులు, అన్నార్ధుల కోసం టిడిపి స్థాపించారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని నినదించారు సామాన్యలను చట్ట సభల్లో కూర్చోబెట్టారు పౌరాణికం, నాటకాలు, సామాజిక అంశాలను స్పృశిస్తూ 300సినిమాల్లో ఎన్నో పాత్రలు పోషించారు రెండు రూపాయల కు కిలో బియ్యం, పేదలకు ఇళ్లు ఇచ్చారు యన్టీఆర్ అనే మూడు అక్షరాలు వుంటే తనువు పులకిస్తుంది శత జయంతి ని అందరూ స్వచ్చందంగా జరుపుకుంటున్నారు నిమ్మకూరు చెరువు వద్ద 35 అడుగుల యన్టీఆర్ విగ్రహం ఏర్పాటు కు గ్రామస్తులు తీర్మానించారు బంధువులు, కుటుంబ సభ్యులు కలిసి ఈ విగ్రహం కడతారు నేడు యువకులు రాజకీయాల్లోకి రావాలి… ఉత్సాహంతో పని చేయాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబు ది ఇప్పుడు రాష్ట్రం లో పరిస్థితి ఎలా ఉందొ అందరూ చూస్తున్నారు మహానాడులో రాష్ట్ర పరిస్థితి పై పూర్తి గా మాట్లాడతాను
.