బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా పూర్ణ కీలక పాత్రలో నటించిన అఖండ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
ప్రతి ఒక్క సన్నివేశంను కూడా అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.అద్భుతమైన సన్నివేశాలతో పాటు మనసుకు హత్తుకునే సెంటిమెంట్ సన్నివేశం కూడా ఉందంటూ అభిమానులు చెబుతున్నారు.
ఇంతటి గొప్ప సినిమా ను ఇచ్చినందుకు అభిమానులు బోయపాటికి థ్యాంక్స్ చెబుతున్నారు.ముందు ముందు మరిన్ని సినిమాలను అభిమానులకు బాలయ్య తో కలిసి ఇవ్వాలంటూ బోయపాటిని కోరుతున్నారు.
ఇక చిత్ర యూనిట్ సభ్యులు కూడా అఖండ విజయం ఇచ్చినందుకు గాను థ్యాంక్స్ చెప్పేందుకు ముందుకు వస్తున్నారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ వారం చివర్లో సినిమాకు సంబంధించిన భారీ విజయోత్సవ వేడుకను నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది.
అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు మరియు ఎన్టీఆర్ ల్లో ఒక్కరు లేదా ఇద్దరు కూడా సక్సెస్ వేడుకలో పాల్గొంటారని సమాచారం అందుతోంది.
వీరిద్దరు కలిసి ఇంతకు ముందు పలు సందర్బాల్లో కలిశారు.కాని బాలయ్య సినిమా కోసం వీరిద్దరు ఒకే స్టేజ్ మీదకు రావడం ప్రథమం.
కనుక ఖచ్చితంగా బాలయ్య మూవీ అఖండ సినిమాకు గొప్ప విజయం దక్కినట్లు అవుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.అఖండ సినిమా చిత్రీకరణ కోసం బాలయ్య పడ్డ కష్టం సినిమా లో తెలుస్తోంది.ఈ వయసులో ఆయన అలా కనిపించడం నిజంగా సూపర్.ఆ విషయాన్ని అప్రిషియేట్ చేసేందుకు అయినా ఇద్దరు హీరోలు రావాల్సిందే అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అఖండ మూవీ విడుదల అయిన ప్రతి చోట కూడా మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి.
తాజా వార్తలు