నిఖిల్ సిద్దార్థ్ తన టాలెంట్ తో వరస హిట్లు కొట్టి మినిమమ్ గ్యారెంటీ హీరోగా నిలదొక్కుకున్నాడు.ప్రెసెంట్ నిఖిల్ నటిస్తున్న సినిమాల్లో ’18 పేజెస్’ ఒకటి.
ఈ సినిమాను కుమారి 21F సినిమా ఫేమ్ సూర్య ప్రతాప్ పల్నాటి తెరకెక్కిస్తున్నాడు.అయితే ఈ సినిమా కథను టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ రాయడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.
ఈ సినిమా త్వరలోనే రిలీజ్ అవ్వబోతుంది.
అలాగే నిఖిల్ కార్తికేయ 2 సినిమా కూడా చేస్తున్నాడు.
ఈయన కెరీర్ లో కార్తికేయ సినిమా ఎంత హిట్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా కార్తికేయ 2 చేస్తున్నాడు.
చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిఖిల్ లోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది.సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చడంతో సూపర్ హిట్ అయ్యింది.
ఇక ఇప్పుడు చేస్తున్న కార్తికేయ 2 ఎలాంటి సస్పెన్స్ క్రియేట్ చేయనుంది అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుండి ట్రైలర్ విడుదల అవ్వగా బాగా ఆకట్టు కుంది.
భారీ ఉరుములతో, మెరుపులతో పక్షుల అరుపులతో సముద్రం మీద ప్రయాణం చేస్తున్న భయానకమైన దృశ్యాలతో ఈ వీడియో వదిలారు మేకర్స్.ఈసారి నిఖిల్ శ్రీకృష్ణుడికి స్టోరీని ఎంచుకున్నట్టు ఒక అంచనాకు వచ్చారు ప్రేక్షకులు.
ఇక ఈ సినిమాలో టాలీవుడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం విదితమే.ఈమె తాజాగా తన డబ్బింగ్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది.అనుపమ ఈ విషయాన్నీ సోషల్ మీడియా వేదికగా పిక్ షేర్ చేస్తూ తెలిపింది.ఇది ఇలా ఉండగా ఈ సినిమాను జులై 22న రిలీజ్ చేయబోతున్నారు.పీపుల్స్ మీడియా, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పథకాలపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.