ఈ మధ్యకాలంలో సెలబ్రెటీలు ఎక్కువగా మద్యపానం గురించి ప్రమోషన్స్ చేస్తున్నారు.టాలీవుడ్ లో కొంతమంది హీరోయిన్లు ఈ మధ్యాన్ని ప్రమోట్ చేస్తూ యాడ్స్ లో నటిస్తున్నారు.
రెజీనా, పూజా హెగ్డే, రాయ్ లక్ష్మి లాంటి హీరోయిన్లు పలురకాల బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నారు.తాజాగా బుల్లితెర యాంకర్ రష్మీ కూడా ఈ వరుసలో చేరింది.
రష్మితో పాటుగా చలాకి చంటి, ముక్కు అవినాష్ ఇలాంటి కమెడియన్స్ కూడా ఈ వరుసలోకి చేరారు.ఈ ముగ్గురూ కలిసి మద్యాన్ని బాగానే ప్రమోట్ చేశారు.
ఈ ముగ్గురు కలిసి చేసిన యాడ్ ఈ విధంగా కొనసాగింది.హాయ్ నంబర్ వన్ చోట ఉన్నావ్ కదా? ఏముంది నీ చేతిలో అని రష్మీ అనడం.తరుణ్ అన్న చెప్పిండి కదా? అని చంటి అనడం.సమ్మటి విస్కీ, కమ్మటి వాసన అందుకే ఎంసీ నంబర్ వన్ అంటూ ఇద్దరూ కలిసి ఒకే సారి మందు బ్రాండ్ను ప్రమోట్ చేశారు.
ఇక తరువాత ఈ గ్రూపులోకి ముక్కు అవినాష్ కూడా జాయిన్ అయ్యాడు.
అప్పుడు చంటి మాట్లాడుతూ.ఏంరా అవినాష్ ఫుల్ ఫేమస్ అయినవ్.దావత్ ఎప్పుడు ఇస్తున్నావ్.
అని అనగా.వెంటనే రష్మీ.
దావత్ అంటే తెలుసు కదా? జబర్దస్త్ గా ఉండాలి.అంటే నెంబర్ వన్ ఉండాలి అని రష్మీ తన స్టైల్లో చెప్పింది.
సరే నాకు పని ఉంది వెళ్తున్నా మన ఫ్రెండ్స్ అందరిని పిలవండి దావత్ చేసుకుందాం అంటూ అవినాష్ కాల్ కట్ చేస్తాడు.అప్పుడు రష్మీ ఎవరిని పిలుస్తావ్ అంటూ చంటి అని అడుగుతుంది.
అప్పుడు ఫ్రెండ్స్ ని పిలవమని చెప్పాడు కదా!అని చంటి అనగా అందరిని అంటే అందరిని మన నెంబర్ వన్ ఫ్రెండ్స్ అందరినీ అని రష్మీ అంటుంది.