ప్రస్తుతం ఈటీవీ రేటింగ్ విషయంలో నెంబర్ గేమ్ లో నిలుస్తుంది అంటే అందుకు ముఖ్య కారణం జబర్దస్త్ అలాగే ఢీ షోలు అని చెప్పవచ్చు.అయితే దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఆధ్వర్యంలో నడిచిన పాడుతా తీయగా షోనీ ఇప్పుడు పూర్తిగా పక్కన పెట్టేశారు.
ఇక పోతే ఢీ షో లో సుడిగాలి సుధీర్, రష్మీ ఉన్నప్పుడు అధిక మొత్తంలో ప్రేక్షకులు ఈ షోను చూడటమే కాకుండా రిపీటెడ్ గా కూడా చూసేవారు.అలాంటిది రష్మీ సుధీర్, ఢీ షో నుంచి వెళ్లిపోయిన తర్వాత ఢీ షోనీ చాలామంది ప్రేక్షకులు చూడటమే మానేశారు.
దీంతో ఈ సీజన్ కు దారుణమైన రేటింగ్ నమోదు అవుతుంది అని ఏకంగా ఈటీవీ వారే స్వయంగా తెలిపిన విషయం తెలిసిందే.
ఢీ డాన్స్ షోను ఉచితంగా ఎవరో కొంత మంది మాత్రమే చూస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ డీ షోకి గట్టిపోటీ ఇవ్వడానికి ఆహా సిద్ధమయ్యింది అంటూ ప్రచారాలు కొనసాగుతున్నాయి.ఢీ షోకి ఏ మాత్రం తగ్గకుండా ప్రముఖ యాంకర్ ఆధ్వర్యంలో ఆహా డాన్స్ షోని నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే ఇటీవలే తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమం పూర్తయిన విషయం తెలిసిందే.దీంతో ప్రస్తుతం డాన్స్ షోని నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నట్లు ఆహా వర్గాల మంచి సమాచారం అందుతోంది.
ఇందుకోసం ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కూడా సిద్ధం అన్నట్లుగా ఇప్పటికే ఆహా టీంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.
శేఖర్ మాస్టర్ తో పాటు మరి కొంత మంది జడ్జీలు కూడా ఆ డాన్స్ షో కి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారట.ఒకవేల ఆహా వారు ఢీ షో కి తగ్గట్టుగా డాన్స్ షోని మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా మంచి స్పందన వస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.ప్రస్తుతం ఆహా లో డ్యాన్స్ షో కి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయట.
ఈ డాన్స్ షో ని స్వయంగా ఆహా వారు నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.మరొకవైపు ఉత్తరాది డాన్స్ కాంపిటీషన్ షో హక్కులు కొనుగోలు చేయడం ద్వారా దాన్ని ఇక్కడ నిర్వహించాలా అనే అంశంలో కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం.