టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని భాషల్లో నటిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతోంది హీరోయిన్ అదితి రావు హైదరి.ఈమె తెలుగు, తమిళ హిందీ, కన్నడ భాషల్లో నటిస్తూ దూసుకుపోతోంది.
భాషతో సంబంధం లేకుండా వరుసగా మంచి మంచి ఆఫర్లను అందుకుంటూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.ఇకపోతే ఇటీవలే టాలీవుడ్ హీరో శర్వానంద్ నటించిన మహా సముద్రం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమా విడుదల అయ్యి విజయం సాధించలేక పోయినప్పటికీ ముద్దుగుమ్మ అదితీ రావ్ కి మాత్రం మంచి గుర్తింపు దక్కింది.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కేన్స్ ఫిలిం ఫెస్టివల్ 2022 ఉత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే.
తాజాగా ఈ ఉత్సవాలలో తలుక్కుమంది ముద్దుగుమ్మ అదితి రావు హైదరి.అది ఈమెతో పాటు గా అవి ఉత్సవాల్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లు అయిన ఐశ్వర్య రాయ్, దీపికా పదుకొనే, నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్ మాధవన్, అలాగే టాలీవుడ్ ముద్దుగుమ్మ పూజా హెగ్డే తదితరులు పాల్గొన్నారు.
ఇకపోతే ఈ వేడుకలో భాగంగా ఐదో రోజు రెడ్ కార్పెట్ పై రెడ్ అండ్ పింక్ రౌండ్ లో నడిచి అందరినీ ఆకట్టుకుంది అదితిరావు.ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
ఇంటర్వ్యూ లో భాగంగా అదితి రావు హైదరి మాట్లాడుతూ.
నేను చాలా పొట్టిగా ఉంటాను.అందుకే కేన్స్ ఫెస్టివల్ లో ఉన్నా జిరాఫీ లతో పోటీ పడలేనని తెలిపింది.అంతే ఆ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉన్న మిగతా హీరోయిన్లు అందరూ తన కంటే హైట్ ఎక్కువగా ఉంటారు అన్న ఉద్దేశంతో జిరాఫీ అన్న పదాన్ని ఉపయోగించింది.
నేను నేను ఒక నటిని.పొట్టిగా ఉన్నప్పటికీ బాధ లేదు.ఎందుకంటే నాలాగా ఉండడానికి నేను ఎంతో సౌకర్యవంతంగా ఫీల్ అవుతాను.అందుకే ధైర్యం చేసి మరీ ఫెస్టివల్లో పాల్గొంటాను అని చెప్పుకొచ్చింది.
అంతేకాకుండా నేను చాలా తెలివి తక్కువ పని చేయబోతున్నాను.రెడ్ కార్పెట్ పై నడిచేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రకమైన పొరపాటు చేస్తాను అప్పుడు నన్ను అందరూ విమర్శిస్తారు అయినప్పటికీ పర్వాలేదు.అంతా మనమంచికే.ఎందుకంటే దాని నుంచి కూడా చాలా నేర్చుకోవచ్చు అని చెప్పుకొచ్చింది అదితి రావు హైదరి.కానీ రెడ్ కార్పెట్ పై మాత్రం ఆమె ఎటువంటి పొరపాటు లేకుండా నడిచి అందరినీ ఆకట్టుకుంది.రెడ్ కార్పెట్ పై ఆమె ధరించిన పింక్ అండ్ రెడ్ డ్రెస్ లో ఆమె అందరినీ ఆకట్టుకుంది.