మోడల్ గా, ప్రముఖ సినీ నటిగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.2006 సంవత్సరంలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ శ్రీలంక తరపున మిస్ యూనివర్స్ పోటీకి ఎంపికయ్యారు.మాస్ కమ్యూనికేషన్ లో డిగ్రీ చేసిన జాక్వెలిన్ ఫెర్నాండేజ్ శ్రీలంకలో టీవీ రిపోర్టర్ గా కూడా పని చేయడం గమనార్హం.అలాడిన్ అనే ఫాంటసీ డ్రామా ద్వారా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కెరీర్ ను మొదలుపెట్టారు.
2011 సంవత్సరంలో రిలీజైన మర్డర్ 2 సినిమా ద్వారా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తొలి సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు.ఆ తర్వాత జాక్వెలిన్ కు గ్లామర్ రోల్స్ లో ఎక్కువగా అవకాశాలు రాగా ఆ పాత్రల్లోనే జాక్వెలిన్ ఎక్కువగా నటించడం గమనార్హం.
అయితే ఈ మధ్య కాలంలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పలు వివాదాల ద్వారా వార్తల్లో నిలిచారు.మనీ లాండరింగ్ కు సంబంధించిన కేసులో ఆరోపణలు రావడంతో ఈ నెల 8వ తేదీన జాక్వెలిన్ ఈడీ ముందు హాజరు కానున్నారు.
బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన జాక్వెలిన్ కు శ్రీలంకలో సొంతంగా ఒక దీవి కూడా ఉంది.
సినిమాలతో పాటు ఈవెంట్లు, బ్రాండ్ ఎండార్స్ మెంట్ల ద్వారా ఈ బ్యూటీ భారీ మొత్తంలో సంపాదిస్తున్నారు.తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ బ్యూటీ ఆస్తుల విలువ 75 కోట్ల రూపాయలుగా ఉంది.జాక్వెలిన్ వార్షిక ఆదాయం విషయానికి వస్తే ఈమె వార్షికాదాయం 8 కోట్ల రూపాయలుగా ఉందని సమాచారం అందుతోంది.
సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తి జాక్వెలిన్ కు 10 కోట్ల రూపాయల విలువైన బహుమతులను ఇచ్చారని ఈడీ ఆరోపణలు చేస్తోంది.ఈ బహుమతులలో 9 లక్షల రూపాయల పెర్షియన్ పిల్లితో పాటు 52 లక్షల రూపాయల విలువైన గుర్రం ఉన్నాయని సమాచారం.హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తెలుగు సినిమాలలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.