పరుగెత్తుతూ పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు అనే సామెత మీరు వినే ఉంటారు.అయితే ప్రస్తుతం యువత ఆలోచన తీరు మారుతోంది.
తాము పరుగులెత్తుతూ ఏం కావాలన్నా తింటాం అనే థోరణిలో ఉన్నారు.పాత కాలంలో అయితే ప్రజలు ఇదేమి చోద్యం అంటూ చూసేవారు.
అయితే ప్రస్తుతం కాలం మారింది.మారిన సమాజానికి తగ్గట్టే వివిధ రకాల ఆవిష్కరణలు కూడా పుట్టుకొస్తున్నాయి.
తాజాగా ఓ రన్నింగ్ డైనింగ్ టేబుల్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా తరచూ ట్విట్టర్లో ఆసక్తికరమైన వీడియోలు, ఫొటోలు అభిమానులతో పంచుకుంటుంటారు.ఎవరైనా ఏదైనా ప్రశ్నలు అడిగినా తనదైన రీతిలో సమాధానం ఇస్తారు.తాజాగా కదిలే డైనింగ్ టేబుల్కి సంబంధించిన ఆసక్తికరమైన వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు.నలుగురు వ్యక్తుల బృందం పెట్రోల్ బంకు వద్ద భోజనం చేస్తూ ఆనందిస్తున్నట్లు ఆనందిస్తున్నట్లు వీడియోలో ఉంది.
వారు ప్రయాణిస్తూ పెట్రోల్ బంకుకు రావడం, అక్కడ ఓ వ్యక్తి చకచకా పెట్రోల్ నింపడం ఆ వీడియోలో కనిపిస్తుంది.
తిరిగి పెట్రోల్ నింపిన తర్వాత వారు అక్కడ నుంచి వెళ్లి పోతారు.ఆ సమయంలో వారు తినడం మాత్రం ఆపరు.అంటే ఓ వైపు ప్రయాణిస్తూనే మరో వైపు తినొచ్చనే సందేశాన్ని వారు ఇచ్చారు.
ఇక ఈ వీడియోపై ఆనంద్ మహీంద్ర ఆశ్చర్యం వ్యక్తం చేశారు.తాను ఈ టెక్నాలజీని చూసి నిజంగా ఆశ్చర్యపోయినట్లు తెలిపారు.ట్విట్టర్ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది.37 వేల కంటే ఎక్కువ లైక్లు, 4,157 రీట్వీట్లు వచ్చాయి.